వర్ని, ఏప్రిల్ 2 : ఓ పెండ్లి వేడుకకు హాజరైన 30 మందికి కరోనా సోకింది. మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం నలుగురికి పాజిటివ్ రావడంతో గ్రామంలో కలకలం మొదలైంది. దీంతో మోస్రా పీహెచ్సీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామానికి చెందిన 85మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. తాజాగా మరో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్య సిబ్బంది వెల్లడించారు. గ్రామంలో మొత్తం బాధితుల సంఖ్య 30కి చేరిందని చెప్పారు. వారికి మెడికల్ కిట్లను అందజేసి హోం ఐసొలేషన్లో ఉంచినట్లు తెలిపారు. మిగతా వారికి శనివారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ విజయ్ కుమార్, ఏఎన్ఎంలు విఠాబాయి, మహేశ్వరి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, సర్పంచ్ కలియాబాయి దశరథ్ పాల్గొన్నారు.
రెండు డోసుల టీకా తీసుకున్నా.. వైద్యాధికారికి పాజిటివ్
వర్ని కమ్యూనిటీ దవాఖాన వైద్యాధికారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ వైరస్ సోకినట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే దాని ప్రభావం ఉండదని ఈ సందర్భంగా దవాఖాన వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి జిల్లాలో 121 కరోనా కేసులు నమోదు
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మొత్తం 121 కరోనా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 1880 మందికి పరీక్షలు నిర్వహించగా 83 కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 17,780 కేసులు నమోదైనట్లు వివరించారు.
కామారెడ్డి జిల్లాలో 38 ..
కామారెడ్డి జిల్లాలో శుక్రవారం 796 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 14,236 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
నిజామాబాద్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
నిజామాబాద్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. శుక్రవారం 2301మందికి కొవిడ్ టీకా వేసినట్లు డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు.
బోధన్ ఎమ్మెల్యే షకీల్కు కొవిడ్ పాజిటివ్
నిజామాబాద్ జిల్లా బోధన్ శాసనసభ్యుడు షకీల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గురువారం హైదరాబాద్లో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే షకీల్ తండ్రి ఆజాం, తల్లి, సోదరికి పదిరోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే తండ్రి ఆజాం హైదరాబాద్లోని యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే షకీల్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మూడు రోజులుగా తనను కలిసిన వారందరూ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే షకీల్ ఓ ప్రకటనలో సూచించారు.
ఇవీ కూడా చదవండి..
ఆ దేశం అమ్మాయిలను వివాహమాడటంపై సౌదీ నిషేధం..!
ఆస్ట్రేలియాలో వరదలు.. 100 ఏండ్ల రికార్డు బద్దలు
పేలిన అగ్నిపర్వతం.. డ్రోన్తో తీసిన అద్భుతమైన వీడియో
ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు.. యూఏఈ మధ్యవర్తిత్వం!
చైనా వ్యాక్సిన్ను తిరస్కరిస్తున్న తైవాన్ ప్రజలు.. ఎందుకంటే..?
109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్.. చరిత్రలో ఈరోజు