హైదరాబాద్: ఏ పదార్థమైనా తీయగా ఉందంటే అందులోని చక్కెరలే కారణం. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సహా వివిధ రకాల పదార్థాల్లో చక్కెరలు గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ రూపంలో నిలువ ఉంటాయి. అలాగే తేనెలో కూడా తీపిని ఇచ్చే పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని ట్రెహలోజ్ అంటారు. ఈ ట్రెహలోజ్ గుండె వ్యాధులను నివారించడానికి తోడ్పడుతుందని ఒక అధ్యయనంలో తేలింది.
పరిశోధకులు కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్ను ఇంజెక్ట్ చేసి పరిశోధించారు. ఆ పరిశోధనా ఫలితాలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయనే అభిప్రాయం కలుగజేస్తున్నాయట. తేనెలోని ట్రెహలోజ్ ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్ (ఒకరకమైన పాచి) చేరలేదట. పైగా గతంలో చేరిన ప్లాక్లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించిందట.
అయితే ట్రెహలోజ్ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లో, ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లో మాత్రం ప్లాక్ తగ్గుదల కనిపించలేదట. రక్తనాళాల్లోని ప్లాక్ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్ అనే ఒక రకం ఇమ్యూన్ కణాలు చేస్తుంటాయి. వాటిని పుట్టించేందుకు అవసరమైన టీఎఫ్ఈబీ అనే ఒక రకమైన ప్రొటీన్ ఉత్పాదనకు ట్రెహలోజ్ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్ సహాయంతో రక్తనాళాల్లోని పాచిని తొలగించి, తద్వారా గుండెపోటును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే విషయం తెలుసుకునేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో