సిద్దిపేట : సిద్దిపేట నాడు ఉద్యమం.. నేడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. టీఆర్ఎస్కు సిద్దిపేట కంచుకోట అని సిద్దిపేట ప్రజలు మరో సారి నిరూపించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో 36 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందిందన్నారు.
5 స్థానాల్లో స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక్కో స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారని వివరాలను వెల్లడించారు. మొత్తంగా సిద్దిపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన సిద్దిపేట ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట ప్రజలు గొప్ప చైతన్య వంతులు అని, వారికి మంచి సేవ చేసి ప్రజల మన్ననలు పొందాలని గెలుపొందిన అభ్యర్థులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం