మణుగూరు రూరల్, మార్చి 30: ఏరియాలో సమస్యలపై మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలోస్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏరియా జీఎం జక్కం రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్రావు నేతృత్వంలో కార్మికులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు యూనిఫాం ఇవ్వాలని, ఈపీ ఆపరేటర్లు సామగ్రి భద్రపరుచుకునేందుకు కప్బోర్డులు ఏర్పాటు చేయాలని, ఏరియా ఆస్పత్రిలో ఎక్స్-రే యంత్రాన్ని పునరుద్ధరించాలని, జూనియర్ అసిస్టెంట్లకు సీ-2 క్వార్టర్ల కేటాయింపులు చేయాలని టీబీజీకేఎస్ నాయకులు కోరారు. సమస్యలు పరిష్కరించేందుకు ఏరియా జీఎం జక్కం రమేశ్ ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో అధికారులు డీ వెంకటేశ్వర్లు, ఫిడ్జరాల్డ్, అజయ్కుమార్, బత్తుల శ్రీనివాస్, వెంకట్రావు, వెంకటరమణ, సురేశ్, సురేశ్, నర్సిరెడ్డి, రమేశ్, రాజేశ్వర్రావు, సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్, టీబీజీకేఎస్ నాయకులు వీరభద్రయ్య, కోట శ్రీనివాస్, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి, వర్మ, కృష్ణ పాల్గొన్నారు.
కరోనా కట్టడికి చర్యలు చేపట్టండి
గనుల్లో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు కొనసాగించాలని డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్(పా) చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్తో జీఎం కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కార్మికుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఉన్న అపోహలు తొలిగించి వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు బోగ వెంకటేశ్వర్లు, ఫిడ్జరాల్డ్, వెంకటేశ్వర్లు, పీవో లక్ష్మీపతిగౌడ్, లలిత్కుమార్, రజాక్పాషా, వెంకటరావు, నర్సిరెడ్డి, సురేశ్, పోషమల్లు, వెంకటరమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎస్ఓటూ జీఎంకు సన్మానం
ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న ఎస్ఓటూ జీఎం బోగ వెంకటేశ్వర్లును సెక్యూరిటీ విభాగం అధికారి షబ్బీరుద్దీన్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో సెక్యూరిటీ గార్డ్స్, జమేదార్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మంగళవారం సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జమేదార్లు, సెక్యూరిటీగార్డులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.