అదనపు కలెక్టర్ రఘురాం శర్మ
గద్వాల, మే 22 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జూన్ మొదటి వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రఘురాంశర్మ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సివిల్ సైైప్ల్లె, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం పీఏసీసీఎస్, ఐకేపీ ద్వారా ధాన్యం ఖరీదు చేస్తున్న తరుణంలో రైతులు తెచ్చిన ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు ఏర్పాటు చేసుకుని ఏ రోజుకారోజు టార్గెట్ నిర్ణయించుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు కప్పి రవాణ వాహనాలు ఏ కేంద్రానికి ఎన్ని కావాలో గుర్తించి వాహనాలు వచ్చిన వెంటనే ధాన్యం తరలించాలని ఆదేశించారు. వాహనాలకు పోలీసు శాఖ ద్వారా అనుమతి ఇప్పిస్తామని తెలిపారు. సమావేశంలో సివిల్సైప్లె ఇన్చార్జి మేనేజర్ ప్రసాద్రావు, వ్యవసాయశాఖ అధికారి సక్రియనాయక్తో పాటు అధికారులు వినోద్ పాల్గొన్నారు.