న్యూఢిల్లీ : దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఇప్పటికీ పది శాతం పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని రాష్ట్రాలను కోరింది. కంటైన్మెంట్ జోన్లపై దృష్టిసారించి వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ సూచించారు. దేశవ్యాప్తంగా 73 జిల్లాల్లో రోజువారీ సగటున 100 లోపు కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.
సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టి తిరిగి సాధారణ కార్యకలాపాల్లోకి వెళ్లే క్రమంలో మాస్క్ల వినియోగం తగ్గడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్ మాస్క్లు మన జీవితంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఇక కరోనా వ్యాక్సిన్ సింగిల్ డోసుతో వైరస్ వల్ల మరణం ముప్పు 82 శాతం తగ్గుతుందని అన్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్తో కరోనా సెకండ్వేవ్లో 95 శాతం మరణాలను నిలువరించగలిగామని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పౌల్ పేర్కొన్నారు.