కల్వకుర్తి, మే 25: విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఎమ్మెల్యే 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారితో చాలామంది ఇబ్బందులు ఎదుర్కంటున్నారన్నారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ అవసరం ఎంతో ఉందని, ఏ ఒక్కరూ కూడా ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో కమ్యూనిటీ దవాఖానకు 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నదని చెప్పారు. గ్రామా లు, పట్టణాల్లో జ్వర సర్వే కొనసాగుతున్నదని, కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, అత్యవసర ప నులు ఉంటేనే బయటకు రావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, ఎంపీపీ సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్గౌడ్, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్రావు, బోజిరెడ్డి, బాలు, మనోహర్నెడ్డి, శ్రీశైలం, సైదులు, ఆర్డీవో రాజేశ్కుమార్, తాసిల్దార్ రాంరెడ్డి పాల్గొన్నారు.