హైదరాబాద్,మే 26:అద్భుతమైన ఆరోగ్యకరమైన పండ్లలో ఖర్బుజ ఒకటి. ఈ పండు వేసవిలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వేసవిలో ఒంట్లో నీరు శాతం తగ్గి బాడీ డీ హైడ్రేషన్ కు గురి అవుతుంది.. అందుకే నీరు శాతం ఎక్కువుగా ఉన్న ఖర్బుజా ను తప్పకుండ తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.ఖర్బుజలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది తినడం వల్ల మల మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. అంతేకాదు మూత్ర పిండాల వ్యాధులు, మూత్రాశయ, మల బద్ధకం వంటి వ్యాధులకు చక్కని నివారణగా పనిచేస్తుంది. కడుపుతో ఉన్న మహిళలు ఖర్బుజా తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. కర్బుజాలో ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే చాలా మంచిది.
అంతేకాదు కర్బుజా తింటే కండరాలు బలిష్టంగా మారుతాయి. గుండె సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ సమస్యలు ఉన్నవారు కర్బుజా తింటే చర్మ సమస్యలు అదుపులోకి వస్తాయి. కర్బుజా పండు గుజ్జును జాల్చి ఆ మాసిని కాషాయం చేసుకుని తాగితే కిడ్నీలో రాళ్లు బయటకు వెళ్లిపోతాయి. అంతేకాదు కర్బుజా రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
ఇందులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. అంతేకాదు అల్సర్ రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మధుమేహ వ్యాధి ఉన్నవారు హక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. మొటిమలు ఉన్నవారు కర్బుజా గుజ్జును ముఖానికి రాసుకుని కొద్దీ సేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు తగ్గి ముడతలు కూడా మాయం అవుతాయి.