లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించిన అడిషనల్ ఎస్సీ భరత్
నారాయణపేట, మే 22 : లాక్డౌన్ సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అదనపు ఎస్పీ భరత్ ప్రజలకు సూచించారు. శనివారం డీఎస్పీ మధుసూదన్రావుతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, చౌక్ బజార్ తదితర ప్రదేశాలను సందర్శించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపు సమయంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ పనులు ముగించుకోవాలన్నారు. కరోనా నివారణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు. పలు వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు ధ్రువపత్రాలు, ఈ పాస్లు లేని 14 బైక్లు, 2 కార్లను సీజ్ చేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్రెడ్డి, ఆర్ఐ కృష్ణయ్య, ఎస్సై సైదయ్య పాల్గొన్నారు.