మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి
మున్సిపల్ బడ్జెట్లకు ఆమోదం
సిరిసిల్ల టౌన్, మార్చి31: మున్సిపల్ బడ్జెట్లో విలీన గ్రామాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం కల్పించామని చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్తి, నీటి పన్నులు, మున్సిపల్ దుకాణాల అద్దెలు, తదితర పన్నుల ద్వారా 19.49కోట్లు, 14,15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 112.79 కోట్లు కలుపుకుని మొత్తం 132.28కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. విలీన గ్రామాల అభివృద్ధికి రూ.75లక్షలు, గ్రీన్ బడ్జెట్ 2.74కోట్లుగా కేటాయించినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో పట్టణంలోని అన్ని వార్డులలో మౌలి క వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి అన్సర్, కౌన్సిలర్ పోశవేని సత్య ఉన్నారు.
21.9కోట్లతో వేములవాడ బడ్జెట్
వేములవాడ, మార్చి 31: 2021-22వ ఆర్థిక సంవత్సరానికి గాను 21.9కోట్ల అంచనా ప్రవేశపెట్టిన మున్సిపల్ బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన బడ్జెట్ను రూపొందించారు. ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాలకు విధించే పన్నుల ద్వారా 6.45 కోట్ల ఆదాయం, పట్టణ ప్రణాళికా విభాగం లో నిర్మాణ అనుమతులు, ఆక్రమణదారుల నుంచి వసూ లు చేసే పన్నులను 3కోట్లు, తైబజార్, లైసెన్స్లు, అద్దెలు, ఇతరాత్రాల ద్వారా 75లక్షల ఆదాయం, ట్రేడ్ లైసెన్స్లు, జన న, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు ద్వారా 10లక్షలు, ఇంజినీరింగ్, టెండర్ల షెడ్యూల్ విక్రయాలు, నీటి కులాయిలతో కలిపి ఇతరత్రా 50లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశామని చైర్పర్సన్ తెలిపారు. ఇందు లో సాధారణ నిధులు 11.65కోట్లు కాగా, అభివృద్ధి నిధులు 9కోట్లుగా అంచనా వేసి బడ్జెట్ను రూపొందించామని చెప్పారు. వ్యయం కూడా 21కోట్లుగా రూపొందించామ ని తెలిపారు. జీతభత్యాలు 3.20కోట్లు, పారిశుధ్య నిర్వహణ, సామగ్రి, సిబ్బంది, డీజిల్ కొనుగోలు, వాహనాల ఇన్సురెన్స్, డంప్యార్డు నిర్వహణ 2.50కోట్లుగా అంచ నా వేసినట్లు పేర్కొన్నారు. వార్డుల వారీగా అభివృద్ధి కోసం 1.65కోట్లు, విలీన గ్రామాలకు 80లక్షలు కేటాయించామన్నారు. పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు 1.16కోట్లు కేటాయించామని చెప్పారు. ఇక్కడ కమిషనర్ శ్యాంసుందర్రావు, కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.