శ్రీరాంపూర్, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ మంగళవారం శ్రీరాంపూర్ ఆర్కే 6గనిపై మైసమ్మ దేవాలయంలో టీబీజీకేఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పెట్టం లక్షణ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించా లని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు వరాలు ఇచ్చిన దేవుడు సీఎం చంద్రశేఖర్రావు అని కొనియాడారు. అడుగక ముందే తెలంగాణ ఇంక్రిమెంట్, ఉచిత విదుత్, గృహ రుణాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన కేసీఆర్ పదికాలాల పాటు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, నాయకులు వెంకటరాజం, లక్ష్మీనారాయణ, అన్వేష్రెడ్డి, పోశెట్టి, జాబు రాజయ్య పాల్గొన్నారు.
పాత మంచిర్యాలలోని సాయి ఆలయంలో..
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని మంగళవారం మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాలలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరి బాగుకోరే కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఆయనను గుండెల్లో పెట్టుకుంటున్నారని కొనియాడారు. అలాంటి సీఎం తొందరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకున్నామని పేర్కొన్నారు. సీఎంతో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సాయినాథుడికి పూజలు చేశామని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొలిశెట్టి కిషన్, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, పల్ల రాజన్న, దుర్గం రాజేశ్, చెట్టి శ్రీనివాస్, ధరణి శ్రీనివాస్, ఒడ్నాల రవీందర్, పెంట ప్రదీప్, నవీన్శెట్టి, రమేశ్యాదవ్, నార్ల వంశీ, తదితరులు పాల్గొన్నారు.