అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందనే సంగతి మనందరికి తెలిసిందే. తన సినిమా విషయాలతో పాటు ఫొటో షూట్స్కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండే జాన్వీ కపూర్ అభిమానులలో పలు విషయాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బుధవారం సాయంత్రం 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్స్ మొదలు కాగా, దీనిపై ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేసింది జాన్వీ.
జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్ చేస్తూ..18 సంవత్సరరాల వయస్సు అంత కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవాలని కోరింది. మే 1 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేయించుకోవాలని స్పష్టం చేసింది జాన్వీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్రహ్మాస్త్రా చిత్రంతో పాటు పలు సినిమాలు చేస్తుంది.
ఇవికూడా చదవండి..