చెన్నై : డీఎంకే ఎంపీ కనిమొళి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎంపీ అధికారికంగా ప్రకటించారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కనిమొళి ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగానే కనిమొళికి కరోనా వ్యాపించి ఉండొచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ డోసు టీకా తీసుకోనున్నారు. లక్నోలోని సివిల్ ఆస్పత్రిలో యోగి కరోనా టీకా తీసుకోనున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.