‘దీర్ఘకాలిక ఆరోగ్యానికి సమతుల ఆహారపు అలవాట్లు తోడ్పడతాయి’.. అనే విషయాన్ని నిరూపించారు శాస్త్రవేత్తలు. ఇందుకు ఓ సుదీర్ఘమైన పరిశోధన చేపట్టారు. దాదాపు 5వేల మందిని ఎంచుకొని, 30 ఏండ్లపాటు ఆహారపు అలవాట్లను గమనిస్తూ వచ్చారు. చివరికి తేలిందేమిటంటే.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాల పదార్థాలు, చేపలు, పప్పులు.. ఇలా సమతుల ఆహారం తీసుకొన్న వ్యక్తుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 52 శాతం తక్కువే. నడివయసు దాకా ఈ మంచి అలవాట్లు కొనసాగించినవారిలో అయితే, గుండెజబ్బుల భయం ఏకంగా 61 శాతం తక్కువగా ఉన్నదని బయటపడింది. ఇదే సమయంలో చేపట్టిన మరో పరిశోధనలో.. సమతులాహారం తీసుకొనే మహిళల్లో, మెనోపాజ్ దాటాక హృద్రోగం వచ్చే అవకాశం 17 శాతం తక్కువని నిర్ధారణ అయ్యింది.