న్యూఢిల్లీ, మే 7: డయాబెటిస్తో బాధపడే చాలా మంది రోగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకునేందుకు రోజూ సూదితో వేలిని పొడిపించుకోవాల్సి వస్తుంటుంది. ఇకపై ఆ బాధ ఉండకపోవచ్చు. ఎందుకంటే చెమట ద్వారా సులభంగా గ్లూకోజ్ స్థాయిలను నిర్ధారించే సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి చెమట ద్వారా గ్లూకోజ్ను లెక్కించే విధానాలను ఇప్పటికే కనుగొన్నప్పటికీ.. రక్తంలో కంటే చెమటలో గ్లూకోజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వారివారి శరీర ధర్మాలను బట్టి ఫలితాలు కచ్చితంగా రావడం లేదు. ఈ ప్రతికూలతలను అధిగమిస్తూ శాస్త్రవేత్తలు కొత్త గ్లూకోజ్ సెన్సార్ను అభివృద్ధి చేశారు. వేలి మొన నుంచి చెమటను గ్రహించి ఈ పరికరం 95% కచ్చితంగా గ్లూకోజ్ స్థాయిలను నిర్ధారిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.