తుక్కుగూడ, మే 25 : అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రజలకు సూచించారు. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ పట్టణ కేంద్రంలో మంగళవారం సీపీ మహేశ్భగవత్ లాక్డౌన్ అమలు తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. చెక్ పాయింట్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని, సరైన పత్రాలు, పాసులు లేని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుశోత్తంరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్దన్రెడ్డి, ఎస్సై హయూమ్ తదితరులు ఉన్నారు.