హైదరాబాద్ : పీజీడీఎం ప్రొగ్రాం 2021-23 బ్యాచ్కు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువు తేదీని మే 31 వరకు పొడిగిస్తూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్(ఐపీఈ) బుధవారం నిర్ణయం వెలువరించింది. పీజీడీఎం-జనరల్, పీజీడీఎం-బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, పీజీడీఎం-ఇంటర్నేషనల్ బిజినెస్, పీజీడీఎం-మార్కెటింగ్, పీజీడీఎం-హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం విభాగాల్లో ఐపీఈ కోర్సులను ఆఫర్ చేస్తుంది. CAT / MAT / XAT / CMAT / ATMA / GMAT స్కోర్లు ఉన్న విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు కోసం www.ipeindia.org ని సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 93919 32129/91547 09139 లో సంప్రదించవచ్చు.