ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని భారత హైకమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులకు కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో దాదాపు 12 మంది అధికారులు క్వారంటైన్లో గడపాల్సిందిగా ఆదేశించారు. ఒక అధికారి కుటుంబం గత వారం భారతదేశం నుంచి తిరిగి రాగా.. వారి నుంచి మిగతా వారికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు.
పాకిస్తాన్లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులను కరోనా వైరస్ వేధిస్తున్నది. ఇటీవల ఒక అధికారి భార్య కరోనా పాజిటివ్గా తేలడంతో 12 మంది అధికారులను, వారి కుటుంబాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వీరంతా ఈ నెల 22 న వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్కు వచ్చినట్లు విదేశాంగ కార్యాలయ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి చెప్పారు. పాకిస్తాన్లో అమలుచేస్తున్న కరోనా మార్గదర్శకాల ప్రకారం, వీరికి కరోనా నిర్దారిత పరీక్షలు జరుపగా.. ఒక అధికారి భార్యకు పాజిటివ్గా తేలింది.దాంతో ఈ అధికారులు, వారి కుటుంబసభ్యులు, డ్రైవర్లను నిర్బంధంలోకి వెళ్లాలని భారత హైకమిషన్ను కోరినట్లు ప్రతినిధి తెలిపారు.
ఇలాఉండగా, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్ 14 బెటాలియన్ సిబ్బంది.. బీఓపీ మీయాన్వాలా సమీపంలో భారతదేశంలోకి చొరబడిన ఇద్దరు చొరబాటుదారులను పట్టుకున్నారు. ఈ చొరబాటుదారులను కసూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల మహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఇర్ఫాన్ గా గుర్తించినట్లు బెటాలియన్ కమాండెంట్ జస్పాల్ సింగ్ తెలిపారు. చొరబాటుకు పాల్పడిన ఇద్దరినీ ప్రశ్నించిన తర్వాత వారిని బీఎంఎఫ్ ఖేంకరన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
అజ్మీర్లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు పట్టివేత
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..