ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఢిల్లీ పేసర్లు క్రిస్ వోక్స్, రబాడ ధాటికి 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్లు జోస్ బట్లర్(2), మనన్ వోహ్రా(9)లను వోక్స్ పెవిలియన్ పంపగా..కెప్టెన్ సంజూ శాంసన్(4)ను రబాడ ఔట్ చేశాడు. ప్రస్తుతం శివమ్ దూబే(1), డేవిడ్ మిల్లర్(8) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు రాజస్థాన్ 3 వికెట్లకు 26 పరుగులు చేసింది.