సికింద్రాబాద్ : ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఫలక్నుమా నుండి ఉందానగర్ మధ్య డబుల్ లైన్ను పూర్తిచేయడంతో పాటు ఆ మార్గాన్ని విద్యుదీకరించింది. కొత్త డబుల్ లైన్ 13.98 కిలోమీటర్ల మేర నిర్మించబడింది. ఈ నెట్వర్క్ ఫలక్నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్-లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య విస్తరించి ఉంది.
ఫలక్నుమా-ఉందానగర్ మార్గం కర్నూలు సిటీ, గుంతకల్, బెంగళూరు అదేవిధంగా దిగువ దక్షిణాది ప్రాంతాలతో అనుసంధానమయ్యే సికింద్రాబాద్, కాచిగూడకు ఎంతో ముఖ్యమైన మార్గంగా ఉంది. ఈ మార్గంలో ఎన్నో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఫలక్నుమా-ఉందానగర్ డబుల్ లైన్ పూర్తితో ఈ మార్గంలో సబర్బన్, ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ వంటి అన్ని రకాల రైళ్ల కార్యాచరణ సామర్ధ్యాన్ని మెరుగుపరిచినైట్లెంది. అదేవిధంగా అధిక సంఖ్యలో సరుకు రవాణా రైళ్లను నడిపేందుకు వీలు కలుగుతుంది.
డబుల్ లైన్ పూర్తి చేయడంపై ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మాట్లాడుతూ.. రైల్వే అధికారులు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులను అభినందించారు. ఈ కొత్త మార్గాన్ని ప్రారంభించడంతో రద్దీ తగ్గి ప్రయాణికుల, సరుకు రవాణా రైలు సర్వీసులను సజావుగా నడిపించవచ్చని పేర్కొన్నారు.