వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
ధారూరు, మే 17: సేంద్రియ సాగుకు రాష్ట్ర ప్రభుత్వ పోత్సాహం ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం బురుగుగడ్డ సమీపంలో ఉన్న సేంద్రియ సాగు క్షేత్రాన్ని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి సందర్శించారు. హైదరాబాద్కు చెందిన రాందేవ్బాబా వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. అక్కడ పండిస్తున్న కూరగాయలు, వినియోగిస్తున్న సేంద్రియ ఎరువుల గురించి రాందేవ్బాబాను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్ తదితరులు ఉన్నారు.