ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ భారత వినియోగదారుల కోసం ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ను మార్చి 22 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా అమెజాన్ మైక్రోసైట్ను కూడా ఏర్పాటు చేసింది. ఫోన్స్ ఫెస్ట్ మార్చి 25తో ముగుస్తుందని వెల్లడించింది.
త్వరలో మార్కెట్లోకి విడుదలకాబోతున్న వన్ప్లస్ 9 సిరీస్, వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు కూడా సేల్లో అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీలపై 40శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. శాంసంగ్, షియోమీ, వన్ప్లస్ తదితర బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నట్లు ప్రకటించింది.