చెన్నై : తమిళనాడులో ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం లాక్డౌన్ను పొడగించింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ఇచ్చింది. చెన్నై చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లోని ( చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు) జిల్లాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నాన్ ఏసీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే మెట్రో రైలు సేవలు సైతం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయని తెలిపింది.
ఈ-రిజిస్ట్రేషన్ లేకుండా ఆటోరిక్షాలు, అద్దె క్యాబ్లలో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. గరిష్ఠంగా వంద మందితో సినిమా, టీవీ షూటింగ్లకు అవకాశం కల్పించింది. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి.. మధ్య ప్రాంతంలోని 11 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. 23 ఇతర జిల్లాల్లో పలు దుకాణాలు, ఆఫీసులు తదితర కార్యకలాపాల నిర్వహణకు నిర్ధిష్ట సమయాన్ని పొడగించింది.