న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ తాజాగా అనారోగ్య కారణాల రీత్యా తనను అంటిగ్వాకు గానీ, అమెరికాకు గానీ తరలించాలని డొమినికా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి 2018లో దేశం విడిచి పరారైన సంగతి తెలిసిందే.
తొలుత అంటిగ్వాలో తల దాచుకున్న మెహుల్ చోక్సీ.. గత మే 23న అనుమానాస్పద రీతిలో అద్రుశ్యం అయ్యాడు. 26న దేశంలోకి చట్ట విరుద్ధంగా డొమినికా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కానీ, తనను కొందరు బలవంతంగా కిడ్నాప్ చేశారని చోక్సీ ఆరోపించారు.
ఇప్పుడు న్యూరాలజికల్ సమస్యలు ఉన్నాయన్న పేరుతో డొమినికా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు చోక్సీ. డొమినికాలో చికిత్స లేనందున తనను అంటిగ్వాకు గానీ, అమెరికాకు గానీ తరలించాలని కోరారు.
ఇప్పటికే ఆయన దాఖలు చేసిన రెండో బెయిల్ పిటిషన్ విచారణను న్యాయస్థానం ఈ నెల 23కు వాయిదా వేసింది. కానీ అనారోగ్య కారణాలతో ఆ పిటిషన్ విచారణను ఈ నెల 12వ తేదీకి జరిపిందని తెలిపారు.
కొందరు భారత ప్రభుత్వ అధికార ప్రతినిధులు తనను చట్ట విరుద్ధంగా డొమినికాకు తరలించారని, తనను అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం అంటూ చోక్సీ మరో పిటిషన్ వేశారు.
తనకు వ్యతిరేకంగా డొమినికా పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. ఈ విషయమై దాఖలు చేసిన జ్యుడీషియల్ రివ్యూ పిటిషన్ను న్యాయస్థానం వచ్చే నెల 27కు వాయిదా వేసింది.
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
పులిని వెంబడించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
6 ఏళ్ల బాహుబలి… ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కప్పా వేరియంట్ గురించి ఏమీ చెప్పలేం : వైద్య నిపుణులు
రూ.10 లక్షల లోపు బెస్ట్ డీజిల్ కార్లు ..
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!
Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!