న్యూఢిల్లీ: కరోనా అనంతర కాలంలో దేశీయంగా ఆన్లైన్ పేమెంట్స్కు గిరాకీ పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ చెల్లింపులు 50 శాతం పై చిలుకు ఆన్లైన్లోనే సాగుతుండటం దీనికి నిదర్శనం. ఇంటి సరుకులు మొదలు యుటిలిటీ బిల్లులు, బీమా ప్రీమియం చెల్లింపులన్నీ ప్రజలు ఆన్లైన్లోనే చేస్తున్నారని ఎస్బీఐ కార్డ్ ఎండీ కం సీఈవో అమర రామమోహనరావు తెలిపారు. మున్ముందు డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయన్నారు.
దేశంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ చెల్లింపులతో వస్తువులు, సేవలు పొందడం పెరుగుతుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు స్థాయిని బట్టి మినహా ఇప్పటికిప్పుడు డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయా? లేదా? అన్న సంగతి చెప్పలేం అన్నారు.
గతంలో ఆన్లైన్లో ఎస్బీఐ కార్డు చెల్లింపులు సమారు 44 శాతం జరిగేవి. కానీ ఈ గతేడాది మూడో త్రైమాసికంలో 53 శాతం పైచిలుకు పేమెంట్స్ ఆన్లైన్లోనే జరిగాయి. అంటే 2020తో పోలిస్తే తొమ్మిది శాతం పెరిగాయి. గ్రాసరీలు, దుస్తులు, యుటిలిటీ పేమెంట్స్, బీమా ప్రిమియం పేమెంట్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం ఆన్లైన్ పేమెంట్స్ ప్రాధాన్యం ఇస్తున్నారని అమర రామ మోహన్రావు చెప్పారు.
గతేడాది మూడో త్రైమాసికంలో ఎస్బీఐ కార్డు చెల్లింపులు 1.15 కోట్లకు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరుగుదల రికార్డయింది. నూతన ఖాతాదారులు ఎనిమిది శాతం పెరిగి మొత్తం కస్టమర్ల సంఖ్య 9.18 లక్షలకు పెరిగింది.
ఒకసారి ఆన్లైన్ చెల్లింపులకు వినియోగదారులు అలవాటు పడితే కొవిడ్, నాన్-కొవిడ్ సమయాల్లోనూ ఆన్లైన్ చెల్లింపులకు ప్రియారిటీ ఇస్తారని రామ మోహనరావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ పెరిగినా కొద్దీ.. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్).. విస్తరిస్తామన్నారు.
వచ్చే ఐదారేండ్లలో క్రెడిట్ కార్డ్ గ్రోత్ ప్రథమ శ్రేణి నగరాల్లో కనిపిస్తున్నందని రామ మోహనరావు తెలిపారు. ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి నగరాల్లో 58 శాతం ఆన్లైన్ చెల్లింపులు జరుగుతున్నాయని ఎస్బీఐ కార్డ్స్ తెలిపింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం