తిరుమల,జూలై: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించినట్లు తిరుమలతిరుపతి దేవస్థానం ఈవో డా.కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని పిఏసి-4లో గల కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈవో,అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భద్రతా,నిఘా వ్యవస్థలు చాలా బాగుందన్నారు. కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను శాశ్వత భవనంగా పిఏసి-4లో ఏర్పాటు చేసేందుకు అవసమైన చర్యలు చేపడతామన్నారు.
ఇజ్రాయల్ టెక్నాలజీతో కూడిన భద్రాత వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. తిరుమలను నేర రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు టీటీడీ భద్రాత సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని అభినందించారు. త్వరలో మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలన్నారు. తద్వారా మరింత పటిష్ఠమైన భద్రత వ్యవస్థను తిరుమలలో ఏర్పాటు చేయాలని ఆయన సివిఎస్వో ను కోరారు.