నాగల్గిద్ద, జూన్ 4 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఏండ్ల నాటి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. గ్రామాల్లో పచ్చదనం పెరుగుతున్నది. పారిశుధ్యం మెరుగుపడి.. స్వచ్ఛత దిశగా పల్లెలు పయనిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం రాష్ట్ర సరిహద్దు అయిన ఏస్గి గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామంలో పల్లె ప్రగతితో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ పం చాయతీకి ప్రభుత్వం ప్రతినెలా నిధులు మం జూరు చేయడంతో సర్పంచ్ రేణుకారాజు పాటిల్ ప్రత్యేక కృషితో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. పం చాయతీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజూ చెత్తను సేకరిస్తున్నారు. దీంతో పారిశుధ్యం మెరుగు పడి గ్రామం స్వచ్ఛత దిశగా పయనిస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఇండ్ల మధ్యన ఉన్న గుంతలను పూడ్చారు. పెంటకుప్పలను తొలిగించారు. పాత ఇండ్లను నేలమట్టం చేశారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రాక్టర్తో ప్రతిరోజూ నీళ్లు పోస్తున్నారు. మొక్క లు ఏపుగా ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకుంది. గ్రామ శివారులో చెరువు వద్ద ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. ఒకప్పుడు రాళ్లురప్పలతో ఉన్న ప్రాంతంలో ఇప్పు డు పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. గ్రామంలో గల్లీగల్లీకి సీసీరోడ్లు, మురుగు కాల్వ లు నిర్మించారు. గ్రామంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతి వనం
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో 1000 మొక్కలు నాటారు. వనానికి ఫెన్సింగ్, ముఖద్వారం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశారు.ప్రకృతి వనంలో వేప, చింత, పూల మొక్కలు నాటారు. సందర్శకులు సేద తీరేందుకు సిమెంట్ కుర్చీలు ఏర్పాటు చేశారు.
ఆదర్శ గ్రామంగా మారుస్తాం
అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతు న్నా. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలోని సమస్యలు పరిష్కరించాం. గ్రామంలో పల్లె థోపకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్యార్డు, పనులు పూర్తిచేశాం. చెత్త సేకరించేందుకు ట్రాక్టర్ను కొనుగోలు చేశాం. హరితహారం మొక్కలు సంరక్షించేందుకు ట్రాక్టర్ ద్వారా నిత్యం నీళ్లు పోస్తున్నాం. నీటి సమస్య పరిష్కరమైంది. అందరి సహకారంతో మోడల్ గ్రామంగా మార్చడానికి కృషిచేస్తున్నాం.
-రేణుకా రాజు పాటిల్, సర్పంచ్, ఏస్గి
గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. గ్రామం లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాం. ప్రభుత్వం పల్లె ప్రగతి నిధులతో మంజూరు చేయడంతో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి. టీఆర్ఎస్ హయాంలో గ్రామాలు అభివృద్ధి సా ధించాం. పల్లె ప్రగతితో గ్రామలు రూపు రేఖలు మారుతున్నాయి.
రేణుకాపాటిల్, ఎంపీటీసీ, ఏస్గి
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ..
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిం చాం. గ్రామాల్లో తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాం. గ్రామాల్లో జరిగే ప్రగతి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్త్తున్నాం. గ్రామాల అభివృద్ధికి జవాబుదారీతనంతో పని చేయాలని సిబ్బందికి ఆదేశించాం.
-షాజిలోద్దీన్, ఎంపీడీవో, నాగల్గిద్ద