పుట్టుమచ్చ రంగు మారినా, చర్మం ఉబ్బినట్టుగా, వాచినట్టుగా అనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
ABCDE పద్ధతిద్వారా గుర్తించండి : గతంలో క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడానికి సంబంధించి స్త్రీలలో నిర్వహించవలసిన స్క్రీనింగ్ టెస్ట్లు తెలుసుకున్నాం. ఇప్పుడు స్త్రీ, పురుషులిరువురు మరియు పురుషులు మాత్రమే చేయించుకోవలసిన పరీక్షల గురించి తెలుసుకుందాం. చర్మ క్యాన్సర్, నోటి క్యాన్సర్, పెద్దపేగులలో క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లను ముందుగానే ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.
స్త్రీ పురుషులిరువురు చేయించుకోవాల్సిన పరీక్షలు
చర్మ క్యాన్సర్ : చర్మ క్యాన్సర్ను గుర్తించడానికి ముఖ్యమైన పద్ధతి.. చర్మాన్ని తరచుగా పరిశీలించడమే! ముఖ్యంగా పుట్టుమచ్చలని ఈ కింద పేర్కొన్న ABCDE పద్ధతి ప్రకారం పరీక్షించుకోవడం మంచిది.
A : పుట్టుమచ్చలను మధ్యగా విభజించి చూసినప్పుడు రెండు అర్ధభాగాలు ఒకేలా ఉండకూడదు.
B : పుట్టుమచ్చ అంచులు
పలుచని రంగులో (Blurr) లేదా రఫ్గా ఉండకూడదు.
C : పుట్టుమచ్చ రంగులో మార్పు రాకూడదు. అంటే, అవి మొదట ఉన్న రంగుకంటే ముదురు రంగులోకి మారటం లేదా పలుచబడటం
కాకూడదు.
D : పుట్టుమచ్చ వ్యాసం 1/4 అంగుళం కన్నా ఎక్కువ ఉండకూడదు.
E : పుట్టుమచ్చ చర్మం మీద ఉబ్బెత్తుగా, వాచినట్లుగా ఉండటం.
పెద్దపేగులలో క్యాన్సర్ అనేది మొదట చిన్నగుల్లలుగా మొదలై క్రమంగా క్యాన్సర్ కణుతులుగా మారే అవకాశం ఉంది. ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలి.
పైన పేర్కొన్న సందర్భాల్లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి FOBT మరియు ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడో స్కోపీ పరీక్షలు చేయించుకోవాలి.
నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉన్న మనలాంటి దేశాలలో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎంతో ముఖ్యం. మిగతా శరీర భాగాలలాగా కాకుండా నోరు అనేది కంటికి కనపడేది కాబట్టి, ప్రాథమిక స్క్రీనింగ్ అనేది సులువు. నోటిలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా పొగాకు నమిలే అలవాటు ఉన్నవారు వెంటనే దానిని మానుకోవాలి. పొగాకు అలవాటు ఉండీ మానేసిన వారుకూడా నోటిలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
మగవారికి నిర్వహించాల్సిన
స్క్రీనింగ్ పరీక్షలు
ప్రోస్టేట్ క్యాన్సర్: మగవారికి వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్కూడా ఒకటి. భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ అసహజమేమీ కాదు, కానీ చాలామందికి దీనిపై అవగాహన లేదు. అనేక అంతర్జాతీయ సంస్థలుకూడా మగవారు రెగ్యులర్గా ప్రోస్టేట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నాయి. 50 సంవత్సరాలు నిండిన మగవారు ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ ఆంటిజన్ (PSA) రక్త పరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా (తండ్రి, సోదరుడు, కొడుకు) ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లయితే మిగతా మగవారు 40 సంవత్సరాల వయసునుంచే ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్
హైదరాబాద్: 9848011421
కర్నూల్: 08518-273001
గుంటూర్: 0863-2223300