న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 34 కో్ట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. సగటున రోజుకు 39.89 లక్షల వ్యాక్సిన్ డోసులు ప్రజలకు వేస్తున్నామని చెప్పారు. ఇక దేశంలో సగటున రోజుఉక 46,000 కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.
గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్యలో13 శాతం తగ్గుదల నమోదైందని అన్నారు. మే 10న 33 లక్షలుగా ఉన్న యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఐదు లక్షల దిగువకు పడిపోయాయని పేర్కొన్నారు. పాజిటివిటీరేటు అధికంగా ఉండి, బెడ్ ఆక్యుపెన్సీ 60 శాతం పైగా ఉన్న జిల్లాల్లో కఠిన నియంత్రణలు అమలు చేయాలని సూచించామని చెప్పారు.