పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
రూ.12.5లక్షలతో వైకుంఠధామం
రూ.4.5 లక్షలతో సైడ్ డ్రైనేజీ నిర్మాణం
ఆహ్లాదపరుస్తున్న పల్లెప్రకృతి వనం, నర్సరీ
నిత్యం నీటితో మొక్కల సంరక్షణ
ఆదర్శ గ్రామ ఎంపికకు ప్రతిపాదనలు
నవాబ్పేట, ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కూ చూర్ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ప్రధాన రహదారులు, పరిసరాలు పచ్చని చెట్లతో కొత్తశోభను సంతరించుకున్నాయి. రెండేండ్ల కిందట సమస్యలతో సతమతమైన గ్రామం.. నేడు పల్లెప్రగతితో నవశకానికి నాంది పలుకుతున్నది. గతానికి.. నేటికీ గ్రామాన్ని పరిశీలిస్తే ఔరా అనిపించక మానదు. సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి కృషికి గ్రామస్తుల సహకారం తోడవడంతో గ్రామం సర్వాం గ సుందరంగా ముస్తాబైంది. గ్రామంలో జరిగిన పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు కూచూర్ను ఆదర్శ గ్రామం గా ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించా రు. గ్రామంలో మొత్తం 421 ఇండ్లు ఉండగా, 1,921 మం ది జనాభా, 1,301 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామస్తులంతా ప్రధానంగా వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. కాగా, గ్రామంలో రెండేండ్ల కిందట పాడుబడిన బావులు, కూలిపోయిన ఇండ్లు, మురుగుకాల్వల్లో నిండిన దుర్గంధం, వీధులన్నీ అస్తవ్యస్తంగా ఉండేది. అయితే, పల్లెప్రగతితో గ్రామానికి మహర్దశ చేకూరింది. నిర్దేశించిన పనులను దశల వారీగా చేపట్టి గ్రామాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచారు.
సర్పంచ్ లక్ష్మమ్మ, పంచాయతీ కార్యదర్శి నర్సింహులు ప్రత్యేక చొరవతో పల్లెప్రగతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. గ్రామ శివారులో రూ.12.5 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. రూ.2.5 లక్షలతో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్డులో ప్రస్తుతం కం పోస్ట్ ఎరువులను తయారుచేస్తున్నారు. గ్రామంలో నిత్యం సేకరించే తడి, పొడి చెత్తను జీపీ ట్రాక్టర్లో తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేస్తున్నారు. పల్లెప్రకృతి వనం చూపరులను ఎం తో ఆకట్టుకుంటున్నది. ఎకరన్నర స్థలంలో పల్లెప్రకృతి వ నం, నర్సరీ ఏర్పాటు చేసి అందులో మెక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నర్సరీలో ప్రస్తుతం టేకు, నిమ్మ, సీతాఫలం, గుల్మొహర్, గులాబీ, చైనాబాదం, చామంతి వంటి మొ క్కలు పెంచుతున్నారు. రూ.4.5 లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని వీధులు, గట్లపై 18,913 మొక్కలు నాటి నిత్యం నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు. గ్రామంలో పాడుబడ్డబావులు, ఇం డ్లను పూర్తిగా తొలిగించారు. గ్రామపంచాయతీ సిబ్బందితో రోడ్లు శుభ్రం చేయిస్తున్నారు.
ప్రతిపాదనలు పంపిస్తాం..
పల్లెప్రగతి పనులు పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు క ష్టపడ్డాం. ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో గ్రామం స్వరూపం మారిపోయింది. పారిశుధ్యంపై మహిళలకు నాలుగు నెలల పాటు అవగాహన కల్పిం చాం. గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు కూచూర్ను ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తాం.
ప్రణాళికాబద్ధంగా పనులు..
మా గ్రామంలో ప్రణాళికాబద్ధంగా పల్లెప్రగతి పను లు చేపట్టారు. ఏడాదిలోనే గ్రామం రూపురేఖలు మారిపోయాయి. వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్తులకు మహిళా సంఘాల సహకారంతో అవగాహన కల్పించారు. ప్రతి రోజూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లోనే తడి, పొడి చెత్త వేస్తున్నాం. గ్రామ అభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి రుణపడి ఉంటాం.
ఇవి కూడా చుడండి
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
పెరుగును ఇలా ఉపయోగించండి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు