ఎల్బీనగర్, జూన్ 12: సాగర్రింగ్రోడ్డులో వరద ముంపు లేకుండా బాక్స్ డ్రైన్స్ నిర్మాణం చేపట్టామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం సాగర్రింగ్రోడ్డు రెడ్డికాలనీ ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న డ్రైన్ నిర్మాణ పనులను ఎల్బీనగర్ సర్కిల్ ఉప కమిషనర్ సురేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో సమీపంలోని డివిజన్ల నుంచి వచ్చే వరదనీరు సాగర్ ఎన్క్లేవ్, రెడ్డికాలనీల్లో చేరి జలమయం అయ్యేదని, దీనిని తొలగించేందుకే నూతన డ్రైన్ నిర్మాణం చేపట్టామన్నారు. పనులను వేగవంతంగా చేపట్టాలని సుధీర్రెడ్డి అధికారులను ఆదేశించారు.