అధిక రక్తపోటును నియంత్రించకపోతే అది గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీల వంటి కీలక శరీర అవయవాలపై ప్రభావం చూపుతుంది. జీన్స్, పలు సందర్భాల్లో ఒత్తిడికి లోనవడం వంటివి మన చేతుల్లో లేనప్పటికీ ఆహారం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. కూరగాయలు, పండ్లు, నట్స్, తృణధాన్యాలు, ప్రొటీన్, చేపల ద్వారా రక్తపోటుకు కళ్లెం వేయవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది.
ట్రాన్స్ ఫ్యాట్స్, రెడ్ మీట్, ప్రాసెస్డ్, రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలని రికమెండ్ చేస్తోంది. ఇక రోజుకు 2300 ఎంజీ కంటే తక్కువగా సోడియం తీసుకోవాలి. ఉప్పు అధికంగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోరాదని స్పష్టం చేసింది. ఉప్పులో ఉండే సోడియం రక్తంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్పై ప్రభావం చూపుతుంది. బీపీ అదుపులో ఉండాలంటే బ్రెడ్స్, రోల్స్, పిజ్జా, శాండ్విచ్ వంటి ఆహార పదార్ధాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి.