జూబ్లీహిల్స్,జూన్21: ప్రజల భద్రతకు పాటుపడే పోలీసులు కరోనాపై పోరుకు సంసిద్ధ్దంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని కొవిడ్పై సమరశంఖం పూరించాలని రాష్ట్ర అదనపు డీజీపీ (టీఎస్ఎస్పీ,బెటాలియన్స్) అభిలాష బిస్త్ పిలుపునిచ్చారు. సోమవారం యూసుఫ్గూడ పోలీస్ బెటాలియన్లో పోలీసులకు, వారి కుటుంబాలకు ఏర్పాటుచేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ అనూప్ కుమార్ మిశ్రాతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, థర్డ్వేవ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ సందర్భంగా వ్యాక్సిన్ కేంద్రంలో తీసుకుంటున్న జాగ్రత్తలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ, అదనపు కమాండెంట్లు కె.వీరయ్య, సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్లు జి.రాజు, రాందాస్, సంపత్ కుమార్ రెడ్డి, జవహర్లాల్తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కొవిడ్ టీకాను ఇచ్చామని విద్యుత్శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 3-4 రోజుల పాటు సాగిన డ్రైవ్లో గ్రేటర్ పరిధిలోనే 10వేల మంది ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ జోన్ పరిధిలో 5048, రంగారెడ్డి పరిధిలో 2931, వికారాబాద్లో 662, మేడ్చల్ పరిధిలో 1976 మంది కలిపి మొత్తం 10617 మంది విద్యుత్ ఉద్యోగులు స్పెషల్ డ్రైవ్లో టీకాను తీసుకున్నారని తెలిపారు.