భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారి ఒడిశా తీరంవైపు దూసుకొస్తున్నదని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ సరిహద్దు వద్ద ఒడిశా తీరాన్ని యాస్ తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ వెల్లడించినట్లు ఆయన చెప్పారు.
భారత వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం మే 26న యాస్ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాము మరో 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఒడిశా తీరానికి పంపించామని ఆయన చెప్పారు.