వికారాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం, ఉపాధి హామీ, ప్రకృతి వనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం బాగా పని చేసినందుకు అభినం దించారు. కూలీలకు పని కల్పించడంలో మంచి పురోగతి చూపించారని , ఈ పథకం కింద ఎక్కువ పనులు చేయడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ర్టానికి అదనపు నిధులు తెచ్చుకోగలిగామన్నారు. పట్టణ ప్రాంతాల్లో నడిబొడ్డున ఉండేలా సమీకృత మా ర్కెట్లకు స్థలాలను ఎంపిక చేయాలన్నారు. జిల్లాలో కోర్టుల నూతన భవనాల నిర్మాణానికి కలెక్టర్ కార్యాలయాలు,లేదా అనువైన చోట స్థలాలను చూడాలన్నారు.
ధరణి పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన కొత్త మాడ్యూల్స్ ను ఉపయోగించడం ద్వారా పెండింగ్ మ్యుటేషన్లు పరిష్కరించాలన్నారు. కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు కూడా పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాపై ప్రతివారం తప్పనిసరిగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం సమావేశాలు నిర్వహించా లని సూ చించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గతంలో మాదిరిగానే ప్రతి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని,గత సంవత్సరంతో పోలిస్తే ఈ సం వత్సరం ధాన్యం కొను గోలు కేంద్రాల సంఖ్య తగ్గించవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై తక్షణమే సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సీఎస్ ఆదేశిం చారు. నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించడంతో పాటు అనవస రంగా రైతులకు ఇబ్బందులు కలి గించవద్దని,గన్నీ బ్యాగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్,జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, డీసీఎస్వో రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలను సాధిస్తాం : రంగారెడ్డి కలెక్టర్
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన అన్ని లక్ష్యా లను సాధిస్తామని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్ పల్లె ప్రగతి, ధరణి, హరితహారం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొవిడ్ తదితర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుం టామని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలు పరిశీలించినట్టు తెలిపారు. యాసంగిలో సుమారు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసేందుకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, సివిల్ సప్లయ్ అధికారి మనోహర్ రాథోడ్, శ్యామలక్ష్మి, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఆర్టీసీ సిబ్బందికి మంచి రోజులు!
బల్దియా ఆస్తిపన్ను లక్ష్యం రూ.400 కోట్లు