అమరావతి,జూన్30:భార్యపైకక్షపెంచుకున్నభర్త ఆమె నిద్రిస్తున్నసమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ట్యాక్సీ డ్రైవర్ జ్యోతికుమార్ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకోగాప్రధాన నిందితుడు శ్రీకాంత్రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.బద్వేలుకు చెందిన శ్రీకాంత్రెడ్డి, చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరి (27)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్రెడ్డి అవినీతి నిర్మూలన పేరిట ఓ సంస్థను స్థాపించాడు. దీని సాయంతో పలువురిని బెదిరించి రూ.లక్షల్లో వసూళ్లు చేశాడు. కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని ఇదే తరహాలో మోసగించి రూ.లక్షల్లో దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే రూ.90 వేలు జీతం తీసుకునే భువనేశ్వరిని వేధించేవాడు.
ఆమె జీతం మొత్తం విలాసాలకు ఖర్చు చేసేవాడు. ఆమె బంధువులు,స్నేహితుల ద్వారా రూ.లక్షల్లో అప్పు తీసుకొని తనకు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో తీరు మార్చుకోవాలని భువనేశ్వరి భర్తకు సూచించింది. ఇక తన ఆటలు సాగవని భావించిన శ్రీకాంత్రెడ్డి ఈ నెల 22న తెల్లవారుజామున 2గంటల సమయంలో నిద్రపోతున్న భార్య ముఖంపై దిండు అదిమి హతమార్చాడు. అదేరోజు ఓసూట్కేసులో మృతదేహాన్ని కుక్కి ట్యాక్సీలో రుయా ఆస్పత్రి ప్రాంగణంలో భార్య మృతదేహానికి నిప్పుపెట్టాడు.మరుసటి రోజు కాలిన మనిషి అవశేషాలు వెలుగులోకి రావడంతో పరారయ్యాడు.