హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో త్వరలో హరిత హోట ళ్లు ప్రారంభం కానున్నాయి. ఎకో టూరిజం సర్క్యూ ట్ (సోమశిల, ఉమామహేశ్వరం, మన్ననూర్, ఈగలపెంట)తోపాటు ట్రైబల్ సర్క్యూట్ (గట్టమ్మ, తాడ్వాయి, మేడారం, బొగత వాటర్ఫాల్, మల్లూర్)లో నిర్మించిన ఈ హోటళ్లలో వెంటనే సేవలు ప్రారంభించాలని టీఎస్టీడీసీ డైరెక్టర్ల బోర్డు నిశ్చయించింది. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం టీఎస్టీడీసీ బోర్డు 28వ సమావేశం జరిగింది. హరితహోటళ్లు, బోటింగ్, పర్యాటక ప్రాంతా ల్లో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్ను, టీఎస్టీడీసీ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 30 శాతం పెరుగుతాయి. సమావేశంలో టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఎండీ మనోహర్రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ శేఖర్రెడ్డి, బోర్డు సభ్యుడు, పర్యాటకశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.