అబ్దుల్లాపూర్మెట్, జులై 8 : ప్రణాళికా పనులను పకడ్బందీగా చేపట్టాలని ప్రత్యేకాధికారి రాజేశ్వర్రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చిన్నరావిరాల గ్రామంలో అధికారులు పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతివనం, నర్సరీలో మొక్కల పెంపకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను జేసీబీ సాయంతో కూల్చి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్రెడ్డి, సర్పంచ్ వనజ, ఉపసర్పంచ్ శేఖర్రెడ్డి, కార్యదర్శి ప్రేమలత పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో పరిశుభ్ర గ్రామాలు
మండలంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో పురాతన ఇండ్ల కూల్చివేత, హరితహారంలో మొక్కలు నాటడం, కలుపు మొక్కలు తొలగించడం, మురుగు కాల్వలు, రోడ్లను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ పనులు చేపడుతున్నారు. పోచారం, కర్ణంగూడ గ్రామాల్లో ప్రగతి పనులను ఎంపీపీ కృపేశ్ పరిశీలించారు.
మారుతున్న మున్సిపాలిటీ రూపురేఖలు
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపురేఖలు మారుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి అన్నారు. మున్సిపాలిటీలోని 23వ వార్డులో కౌన్సిలర్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పురాతన ఇండ్లు కూల్చివేయడంతో పాటు కలుపు మొక్కలు తొలగించడం, రోడ్లను శుభ్రం చేయడం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
గ్రామాలు, తండాలు అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మండలంలోని ముద్విన్ గ్రామంలో గురువారం నిర్వహించిన పల్లెప్రగతిలో ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ యాదయ్యతో కలిసి జడ్పీటీసీ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ప్రత్యేకాధికారి ధాత్రిదేవి, ఎంపీవో తేజ్సింగ్, ఉప సర్పంచ్ వినోద్, నాయకులు శ్రీను, శ్రీశైలం, సురేశ్ పాల్గొన్నారు.
మొక్కలు నాటడం అందరి బాధ్యత
మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఆరుట్లలో విష్ణువర్ధన్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. జాపాలలో జడ్పీటీసీ నిత్య నిరంజన్రెడ్డి పల్లెప్రగతిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ నహీదాబేగం, ప్రత్యేకాధికారులు యశ్వంత్, జైపాల్రెడ్డి, కార్యదర్శులు జనార్ధన్రెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
మండలంలోని చింతలపల్లి, సీతారాంనగర్తండాలను మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్కుమార్, ఎంపీడీవో వెంకట్రాములు గ్రామాల్లో పల్లెప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్యార్డు, శశ్మానవాటిక, పల్లెప్రకృతివనం, నర్సరీలను పరిశీలించి పెండింగ్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మంజుల, లక్ష్మి పాల్గొన్నారు.
మొక్కల పెంపకంతోనే హరిత తెలంగాణ
మొక్కలను నాటడంతో పాటు సంరక్షించినప్పుడే హరిత తెలంగాణ సాధ్యమని చైర్ పర్సన్ అనురాధ అన్నారు. 19వ వార్డు ఈస్ట్ సూరజ్ నగర్లో కౌన్సిలర్ కవితాశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ హరితధన్రాజ్ గౌడ్, కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా మొక్కలు నాటారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా మొక్కల పెంపకం ఏకైక మార్గం అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, డీఈ సత్యనారాయణ,ఏఈ గుణాకర్ పాల్గొన్నారు.
ప్రణాళికా పనులు పకడ్బందీగా చేపట్టాలి
ప్రణాళికా పనులను పకడ్బందీగా చేపట్టాలని ప్రత్యేకాధికారి రాజేశ్వర్రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చిన్నరావిరాల గ్రామంలో అధికారులు పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతివనం, నర్సరీలో మొక్కల పెంపకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను జేసీబీ సాయంతో కూల్చి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్రెడ్డి, సర్పంచ్ వనజ, ఉపసర్పంచ్ శేఖర్రెడ్డి, కార్యదర్శి ప్రేమలత పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో పరిశుభ్ర గ్రామాలు
మండలంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో పురాతన ఇండ్ల కూల్చివేత, హరితహారంలో మొక్కలు నాటడం, కలుపు మొక్కలు తొలగించడం, మురుగు కాల్వలు, రోడ్లను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ పనులు చేపడుతున్నారు. పోచారం, కర్ణంగూడ గ్రామాల్లో ప్రగతి పనులను ఎంపీపీ కృపేశ్ పరిశీలించారు.
మారుతున్న మున్సిపాలిటీ రూపురేఖలు
ఇబ్రహీంపట్నం, జులై 8 : పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపురేఖలు మారుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి అన్నారు. మున్సిపాలిటీలోని 23వ వార్డులో కౌన్సిలర్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పురాతన ఇండ్లు కూల్చివేయడంతో పాటు కలుపు మొక్కలు తొలగించడం, రోడ్లను శుభ్రం చేయడం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
గ్రామాలు, తండాలు అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మండలంలోని ముద్విన్ గ్రామంలో గురువారం నిర్వహించిన పల్లెప్రగతిలో ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ యాదయ్యతో కలిసి జడ్పీటీసీ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ప్రత్యేకాధికారి ధాత్రిదేవి, ఎంపీవో తేజ్సింగ్, ఉప సర్పంచ్ వినోద్, నాయకులు శ్రీను, శ్రీశైలం, సురేశ్ పాల్గొన్నారు.
మొక్కలు నాటడం అందరి బాధ్యత
మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఆరుట్లలో విష్ణువర్ధన్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. జాపాలలో జడ్పీటీసీ నిత్య నిరంజన్రెడ్డి పల్లెప్రగతిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ నహీదాబేగం, ప్రత్యేకాధికారులు యశ్వంత్, జైపాల్రెడ్డి, కార్యదర్శులు జనార్ధన్రెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
మండలంలోని చింతలపల్లి, సీతారాంనగర్తండాలను మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్కుమార్, ఎంపీడీవో వెంకట్రాములు గ్రామాల్లో పల్లెప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్యార్డు, శశ్మానవాటిక, పల్లెప్రకృతివనం, నర్సరీలను పరిశీలించి పెండింగ్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మంజుల, లక్ష్మి పాల్గొన్నారు.
మొక్కల పెంపకంతోనే హరిత తెలంగాణ
మొక్కలను నాటడంతో పాటు సంరక్షించినప్పుడే హరిత తెలంగాణ సాధ్యమని చైర్ పర్సన్ అనురాధ అన్నారు. 19వ వార్డు ఈస్ట్ సూరజ్ నగర్లో కౌన్సిలర్ కవితాశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ హరితధన్రాజ్ గౌడ్, కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా మొక్కలు నాటారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా మొక్కల పెంపకం ఏకైక మార్గం అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, డీఈ సత్యనారాయణ,ఏఈ గుణాకర్ పాల్గొన్నారు.