డీఎస్పీ మధుసూదన్రావు
నారాయణపేట, మే 20 : అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ ని బంధనలు పాటించాలని డీఎస్పీ మధుసూదన్రా వు అన్నారు. గురువారం పట్టణంలో లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పోలీసులు ప్రతిరోజు తనిఖీ లు నిర్వహిస్తున్నా, అనవసర కారణాలు చెబుతూ వివిధ పనులకు బయటకు రావడం కొంతమందికి సరాదాగా మారిందన్నారు.
కరోనాతో కళ్లముందే కుటుంబ సభ్యులు, బం ధువులు, స్నేహితులను కోల్పోతున్నా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎలాంటి కారణాలు లేకుండా రోడ్ల మీదకు వచ్చి అత్యవసర పనుల కోసం ఆపదలో బయటకు వచ్చే వారికి ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల కోసం వెసులుబాటు ఇచ్చిన సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కు లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.