సినీ గేయరచయిత, కవి అదృష్టదీపక్(70) కరోనాతో ఏపీలోని కాకినాడలో ఆదివారం కన్నుమూశారు. బహుముఖప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న అదృష్టదీపక్ పలు అభ్యుదయ చిత్రాల్లో అర్థవంతమైన పాటల్ని రాశారు. వామపక్ష భావజాలంతో పెరిగిన ఆయన బాల్యం నుంచి కథలు, కవితలు రాయడం మొదలుపెట్టారు. 1980లో మాదాల రంగారావు నిర్మించిన ‘యువతరం కదిలింది’ చిత్రంతో గేయరచయితగా అదృష్టదీపక్ సినీ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత విప్లవశంఖం, నవోదయం, నేటి భారతం, దేశంలో దొంగలుపడ్డారు, ప్రజాస్వామ్యం, భారతనారి, ఎర్రమందారం, అన్న, వందేమాతరం, జైత్రయాత్ర, అర్ధరాత్రి స్వతంత్య్రంతో పాటు పలు సినిమాలకు గీతరచన చేశారు. అదృష్టదీపక్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.