ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 22: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సతీమణి వసంతలక్ష్మి కోరారు. 36వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసుమర్తి రామ్మోహన్రావు విజయాన్ని కాంక్షిస్తూ గాంధీచౌక్ ప్రాంతంలో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు కొత్తా వెంకటేశ్వరరావు, ఆకుల సతీశ్, పిల్లుట్ల కృష్ణ, పిల్లుట్ల మంజుల, తన్నీరు శోభారాణి, కొల్లు పద్మ, గోపిక, తాళ్లూరు శైలజ, కొండూరు శ్రీనివాస్, దుర్గి రాము, కకుమ్మరికుంట్ల గిరి పాల్గొన్నారు.
56వ డివిజన్లో..
ఖమ్మం నగరంలోని 56వ డివిజన్లో కూడా మంత్రి అజయ్ సతీమణి వసంతలక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఆ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పైడిపల్లి రోహిణితో కలిసి డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కోట్లాది రూపాయలతో నగరంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ.. ఆశీర్వాదం కోరుతూ ముందుకుసాగారు. టీఆర్ఎస్ నాయకులు పైడిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
వైరల్ అయిన ఫోటో…బయటపడిన గుట్టు
ప్రేమికుడికి ముంబై పోలీసుల ఫన్నీ సమాధానం