షాబాద్, ఏప్రిల్ 14 : బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని నాగరగూడ, కక్కులూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్, జ్యోతిరావుఫూలే విగ్రహాలను జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, సర్పంచులు ఈదుల కృష్ణాగౌడ్, భానూరి మమతజీవన్రెడ్డి, ఎంపీటీసీలు గుత్తి సునీత, కరుణాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్రావు, శ్రీరాంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈదుల నర్సింహులుగౌడ్, జీవన్రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాతకు నివాళి
షాద్నగర్, షాద్నగర్టౌన్, ఏప్రిల్ 14 : పట్టణ ముఖ్యకూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాల్నాయక్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, భీష్వ కిష్టయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, దళిత, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీ భీష్వ రామకృష్ణ, నాయకులు లక్ష్మణ్, జూపల్లి శంకర్, నర్సింహులు, శేఖర్ పాల్గొన్నారు.
ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శం
చేవెళ్ల, ఏప్రిల్ 14 : అంబేద్కర్ జయంతి సందర్భంగా చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ విజయలక్ష్మి, సీనియర్ నాయకుడు వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, రామస్వామి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ శైలజ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్లో..
షాద్నగర్రూరల్, ఏప్రిల్ 14 : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. విఠ్యాల, కిషన్నగర్, వెలిజర్ల, చించోడ్, హాజిపల్లి ఎలికట్ట, దేవునిపల్లి, కంసాన్పల్లి గ్రామాల్లో సర్పంచ్లు, నాయకులు, యువజన సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
షాబాద్లో..
షాబాద్, ఏప్రిల్ 14 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.
చేవెళ్ల రూరల్లో..
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 14 : మండల పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే యాదయ్య హాజరై ఆవిష్కరించారు. ముడిమ్యాల గ్రామంలో సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, రావులపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ నివాళులర్పించారు.
మహనీయుల జయంతి రథయాత్ర
మొయినాబాద్, ఏప్రిల్ 14 : మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని, చిత్రపటాలను హిమాయత్నగర్ చౌరస్తా నుంచి మొయినాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వరకు రథయాత్ర నిర్వహించారు. ఉత్సవాల కమిటీ చైర్మన్ రాజు అధ్యక్షతన ఫూలే జాతీయ అవార్డు గ్రహీత భీంరాజ్ మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆంజనేయులు, మైనార్టీ నాయకులు అన్వర్ఖాన్, స్వేరో నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరులో..
కొత్తూరు రూరల్, ఏప్రిల్ 14 : మండల కేంద్రంతో పాటుగా, తీగాపూర్, పెంజర్ల, కొడిచర్ల, సిద్దాపూర్, ఎస్బీపల్లి గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భీమయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జైపాల్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్రెడ్డి పాల్గొన్నారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్, ఏప్రిల్ 14 : అజీజ్నగర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. హిమాయత్నగర్ చౌరస్తాలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్ పాల్గొని నివాళులర్పించారు. మండల పరిధిలోని సురంగల్, అమ్డాపూర్, కనకమామిడి, చిన్నమంగళారం, ఎన్కేపల్లి, చిలుకూరు, మేడిపల్లి, తోలుకట్టా, నాగిరెడ్డిగూడ, బాకారం, శ్రీరాంనగర్ గ్రామాల్లో జయంతిని నిర్వహించారు.
నందిగామలో..
నందిగామ, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.