తిమ్మాపూర్/ తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆదివారం 115 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి ఇందు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాగా, వ్యాక్సినేషన్ను ఎంపీడీవో చింతల రవీందర్రెడ్డి, ఎంపీవో కిరణ్ పర్యవేక్షించారు.
మానకొండూర్, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 99 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వైద్యాధికారి సంధ్యారాణి తెలిపారు. ఇక్కడ సీహెచ్వో రాజునాయక్, సూపర్వైజర్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా బాధితులకు కోడిగుడ్లు పంపిణీ
తిమ్మాపూర్, ఏప్రిల్ 11: మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఇటీవల 45 కరోనా కేసులు నమోదు కాగా, ఆదివారం బాధితులందరికీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కోడిగుడ్లను అందజేశారు. 45 మందికి ఒక్కొక్కరికీ గుడ్ల ట్రేతోపాటు శానిటైజర్ బాటిల్, నిత్యావసరాలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి
పెన్షన్లలోకి 74% ఎఫ్డీఐ: వచ్చే సమావేశాల్లో బిల్లు
రూ.2 లక్షల విలువైన మద్యం స్వాధీనం