వాషింగ్టన్: ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి అమెరికాలో 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి కోవిడ్ టీకా ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తెలిపారు. మరో రెండు వారాల్లో ప్రజలందరికీ టీకా అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 75 రోజుల్లోనే సుమారు 15 కోట్ల మందికి కోవిడ్ టీకా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలను పాటించాలని ఆయన అమెరికన్లను కోరారు. గతంలో మే ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బైడెన్ తెలిపారు. కానీ ఆ టార్గెట్ డెడ్లైన్ను ముందుకు మార్చినట్లు ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జోరుగా సాగుతోందని, వ్యాక్సిన్ అందుబాటు కూడా ఈజీగా ఉందని, 15 కోట్ల మందికి టీకా ఇచ్చిన తొలి దేశం మనదే అని, ఆరు కోట్ల మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.