సియోల్, ఏప్రిల్ 5: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ.. నష్టాల్లో నడుస్తున్న తమ మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ విడిభాగాలు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, ఇతరత్రా ఉత్పత్తులు, సేవలపై మరింత దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి తమ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపిందని, ఈ జూలై చివరికల్లా మొబైల్ ఫోన్ వ్యాపారం పూర్తిగా మూతబడుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ సంస్థగా వెలుగొందిన ఎల్జీ.. చైనా, ఇతర దేశాల సంస్థల పోటీతో వెనుకబడిపోయింది. మొబైల్స్ వ్యాపారం నుంచి వైదొలిగినా.. ఇప్పటికే అమ్మిన ఫోన్ల సర్విసింగ్ కొనసాగుతుందని ఎల్జీ స్పష్టం చేసింది.
మరిన్ని వార్తలు చదవండి..
హైదరాబాద్లో ఇండ్లకు భలే గిరాకీ