న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జీఎస్ బవా(58).. తన ఇంటికి సమీపంలో ఉన్న పార్కులో చెట్టుకు ఉరేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యల కారణంగానే జీఎస్ బవా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు.