పంటలు ఎండకుండా వరి మడ్లను తడుపుతున్న గోదావరి జలాలు
నారాయణరావుపేట, మార్చి 29 : టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు పూర్తిగా మారాయి. పల్లెల్లో గోదారమ్మ గలగల పారుతున్నది. అపరభగీరథుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రిజర్వాయర్లు పూర్తి కాగా, మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో కొత్తగా ఏర్పడిన నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో సకాలంలో పంటకు సాగునీరు లేక, తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. రంగనాయకసాగర్ ఎడమ కాల్వ ద్వారా వస్తున్న గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. మండల కేంద్రమైన నారాయణరావుపేట పెద్ద చెరువుతో పాటు జక్కాపూర్, గుర్రాలగొంది, మల్యాల, లక్ష్మీదేవిపల్లి, గోపులాపూర్లో చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దూకుతున్నాయి. మండుటెండల్లో .. గిన్ని నీళ్లు ఎప్పుడు సూడలె అని రైతులు సంబురపడుతున్నారు. ఎండిపోయే పంటలకు గోదావరి నీళ్లు అందుతుండంతో ‘ఎవరితోనూ కాలె.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుతోనే’ అయ్యిందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంటకు నీళ్లందుతున్నయ్..
రంగనాయకసాగర్ రిజర్వాయర్తో గ్రామంలో చెరువులు, కుంటలు నిండుకున్నాయి. రెండో సారి ఈ యాసంగిలోనూ చెరువులు నింపారు. పంటలకు గోదావరి నీళ్లు రావడం సంతోషంగా ఉన్నది. రెండెకరాల్లో వరినాట్లు వేశా. పంటకు నీళ్లందుతున్నాయి. రైతుల గోస తీర్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు రుణం తీర్చుకోలేం.