న్యూఢిల్లీ : వరుసగా 24 రోజుల పాటు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గత ఫిబ్రవరి 27న ఇంధన ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరగా.. పెట్రోల్ లీటర్ ధర రూ.91.17కు చేరింది. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్ లీటర్పై 18 పైసలు తగ్గించాయి. సవరించిన ధరలతో పెట్రోల్ లీటర్ రూ.90.99కు చేరింది. అలాగే డీజిల్ లీటర్కు 17 పైసలు తగ్గడంతో ప్రస్తుతం రూ.81.30 చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.97.40, డీజిల్ రూ.88.42, చెన్నైలో పెట్రోల్ రూ.92.95, డీజిల్ రూ.86.29, కోల్కతాలో పెట్రోల్ రూ.91.18, డీజిల్ రూ.84.14, హైదరాబాద్లో పెట్రోల్ రూ.94.61, డీజిల్ రూ.88.67కు చేరింది.