న్యూఢిల్లీ, మార్చి 11: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్.. భారత్లోని తమ డిఫెండర్ 2021 మోడల్ వాహనాల్లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు సీట్లుండే 90 వెర్షన్తోపాటు ఐదు సీట్లుండే 110 వెర్షన్లో ఈ ఆప్షన్ను పొందుపర్చింది. డిఫెండర్ 90 డీజిల్ మోడల్ వాహనాలు రూ.94.36 లక్షల నుంచి రూ.108.16 లక్షలకు, డిఫెండర్ 110 డీజిల్ మోడల్ వాహనాలు రూ.97.03 లక్షల నుంచి రూ.108.19 లక్షలకు లభ్యమవుతాయని ల్యాండ్ రోవర్ వెల్లడించింది.