WHO అధ్యయనం ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తులక్యాన్సర్ మరణాల సంఖ్య అన్ని క్యాన్సర్స్ కంటే అధికంగా ఉండవచ్చు అని అంచనా.సిగరెట్, బీడీలు, పాన్,గుట్కా ఆల్కహాల్, పొగాకు నమలటం మొదలైనవి నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్స్కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది.
పది, ఇంటర్ తరగతులనుండే చదువులని ఇంటికి దూరంగా ఉండే అబ్బాయిలు ఆ తర్వాత పై చదువులు, ఉద్యోగాలు, కాన్ఫరెన్సులు, మీటింగ్ అని దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇంటివంటకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండక తప్పని పరిస్థితులు. అంతే కాకుండా అబ్బాయిలకు -స్నేహితులు, సరదాలు, అమ్మాయిలతో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సరదాగా, టైమ్ పాస్గా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లతో బయట తిండికూడా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బయట తీసుకునే ఆహారం రుచికరంగా నూనెలు, ఉప్పు కారాలు ఎక్కువగా వాడటమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతూ ఉంటుంది. ఇవీ క్యాన్సర్ కారకాలు కావచ్చు.
దురలవాట్లు, బయట తిండి ఎక్కువగా తీసుకోవటం, వృత్తి పరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవటం, వాతావరణ కాలుష్యానికి గురవటం, నైట్ డ్యూటీలు, ఎ.సి. రూముల్లో నిద్ర లేకుండా పనిచేయటం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం మరిన్ని కారణాలు. ఎమయితేనేం మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే ఎక్కువగా క్యాన్సర్కు గురవుతున్నారన్నది నిజం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషులలోనే ఎక్కువ. ఈ మధ్య పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం ఎక్కువ కావటం మరింత బాధాకరం. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్కు గురయ్యే వారి సంఖ్యను చూస్తే 2007 నుండి 2030 సంవత్సరానికి ఈ సంఖ్య 45% పెరిగే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ టెస్టులు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలగటం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం.
WHO అధ్యయనం ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య అన్ని క్యాన్సర్స్ కంటే అధికంగా ఉండవచ్చు అని అంచనా. సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా ఆల్కహాల్, పొగాకు నమలటం మొదలైనవి నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్స్కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 80,000 మంది దాకా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న కోల్కతాలో ప్రతి లక్షమందిలో 20 మంది లంగ్ క్యాన్సర్కు గురవుతున్నారు. తర్వాత కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో ఈ సంఖ్య 15 మందిగా ఉంది. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవటం , ఇంకా మరిన్ని దురలవాట్లు కూడా ఉండటం పొట్టకు సంబంధించిన క్యాన్సర్లకు కారణమవుతున్నాయి. అందుకే, భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్ బారిన పడటం ఎక్కువ ఉన్నట్టు చెబుతున్నాయి.
మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్కు గురవటం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవటం క్యాన్సర్ కారకాలు అవటంతో పాటు పురుషులలో వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ ప్రొడక్షన్ కంపెనీలో పని, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్, చెక్కపొడి, గామా రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పనిచేసేవారికి ఊపిరితిత్తులు, హెడ్, నెక్ క్యాన్సర్స్ ఇతర వృత్తులలో వారికంటే ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగటం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా కూర్చోనే గంటల తరబడి పని చేయటం నైట్ డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్కు మగవారే ఎక్కువగా గురవుతారు. కాబట్టి, వారికి క్యాన్సర్స్ ముప్పు పొంచి ఉంటుంది.
సాధారణంగా పురుషులు అమ్మ, భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. అందుకే బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్ ఫుడను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం. పొంచి ఉండే క్యాన్సర్స్ పురుషులలో వయస్సు పై బడ్డాక కన్పించే ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే తెలుసుకోవటానికి PSA (Prostate Specific Antigen) అనే రక్త పరీక్షను 50 ఏళ్లు పై బడ్డాక చేయించుకోవటం మంచిది. ఎందుకంటే, ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు వీర్యంలో, మూత్రంలో రక్తం కన్పించటం, నడుం, తుంటి, ప్రక్క టెముకల నొప్పులు, మూత్ర సంబంధ సమస్యలు కన్పించేసరికే దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి, PSA పరీక్షలో యాంటిజెన్ పెరగటాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ) ప్రోస్టేట్ బయాప్సితో పాటు అవసరమయితే అల్ట్రాసౌండ్, బోన్స్కాన్, CT స్కాన్, MRI, బయాప్సి వంటి పరీక్షలు చేస్తారు. 50 ఏళ్లు పైబడిన పురుషులలో లక్షణాలు ఉన్నా లేకున్నా PSA టెస్ట్, DRE చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఎంత కాలంలో మళ్లీ చేయించుకుంటే మంచిది? PSA టెస్ట్లో మార్పులు ఎలా ఉంటున్నాయి? ఇంకా ఇతర పరీక్షలను ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయించుకోవాలి? అనే విషయాలమీద అవగాహన పెంపొందించుకోవటం తప్పనిసరి. పురుషులు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్
హైదరాబాద్: 9848011421
కర్నూల్: 08518-273001
గుంటూర్: 0863-2223300